పాన్గల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో గ్రామ సర్పంచు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు అందరూ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గురువారం 20.02.14 శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతి ఇంటికి వెళ్లి మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామంలోని 8, 12వ వార్డుల్లో లక్ష రూపాయల నిధులతో మిని వాటార్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో ఏ అభివృధ్ధి పని జరుగాలన గ్రామ ప్రజల సహాయ సహకారం అవసరమని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు నర్సింహ్మా, వార్డు మెంబర్లు, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, నాయకులు కృష్ణయ్య, లింగయ్య, కిష్టయ్య పాల్గొన్నారు.