Saturday, March 1, 2014

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు...


శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాన్‌గల్‌ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు అట్టహసంగా సాగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 10 జతాల ఎద్దులు పాల్గొనగా మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన జంగిడి వరుణ్‌తేజ ఎద్దులు 3,332 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయిచూరుకు చెందిన అంజనేయ ఎద్దులు 3,142 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచారు. మొదటి బహుమతి రూ.40వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేల నగదును అందజేశారు.








No comments:

Post a Comment