రేమద్దుల గ్రామంలో నిర్వహించిన క్రీడోత్సవాల ముగింపు సభ :
విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పన కోసం యువత పోరాడాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్.పుణ్యవతి అన్నారు. గురువారం రాత్రి పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడోత్సవాల ముగింపు సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. జిల్లా, డివిజన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నల్గొండ కళాకారుల ఆటపాటలు అలరించాయి.
No comments:
Post a Comment