గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ, యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి జబ్బార్ సూచించారు.రేమద్దుల గ్రామంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఉపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతీ, యువకులను పాశ్చత్యా సంస్కృతి వైపు వెళ్లకుండ వారిని చైతన్యం చేయాలన్నారు. అందుకు అందరిని ఒకే వేదికమీదకు తీసుకురావడానికి 30ఏళ్లుగా డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా క్రీడోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ,యువకుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మండల కేంద్రాల్లో మిని స్టేడియాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామకార్యదర్శి వేణుగోపాల్, డివైఎఫ్ఐ గ్రామ అద్యక్ష కార్యదర్శులు భాస్కర్, ఆంజనేయులు, నాయకులు జి.వెంకటయ్య, కృష్ణయ్య, భగత్, రాములు, ఫయాజ్, కైలాప్, తిరుపతి రాములు పలువురు పాల్గొన్నారు.
No comments:
Post a Comment